హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించేందుకు హర్యానా ముఖ్యమంత్రి బుధవారం దాదాపు 4-5 జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అంబాలాలో జిల్లా యంత్రాంగం అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో వరద సహాయక చర్యలపై సమీక్షించారు.

Haryana CM Manohar Lal Reaches Ambala, Expresses Concern Over Flood Damage, Will Also Visit Ambala
హర్యానా(Haryana)లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించేందుకు హర్యానా ముఖ్యమంత్రి(Haryana CM) బుధవారం దాదాపు 4-5 జిల్లాల్లో ఏరియల్ సర్వే(Aerial Survey) నిర్వహించారు. అనంతరం అంబాలాలో జిల్లా యంత్రాంగం అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో వరద సహాయక చర్యలపై సమీక్షించారు. అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పరిశీలించారు. దీంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విపత్తులో ఇళ్లు దెబ్బతిన్న వారి ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధన ప్రకారం.. సాయం చేస్తుందని సీఎం మనోహర్లాల్(Manohar Lal Khattar) అన్నారు. అంబాలా(Ambala)లో అత్యధిక నష్టం జరిగిందని.. కురుక్షేత్ర గ్రామాల్లో ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చెప్పారు. యమునానగర్, కైతాల్, పానిపట్, పంచకులలో కూడా నష్టం వాటిల్లింది. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. పశువులు చనిపోవడం వల్ల కూడా రైతులకు నష్టం వాటిల్లిందని అన్నారు.
ఆహారం అవసరమైన చోట భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, నీరు అవసరమైన చోట ట్యాంకర్ల ఏర్పాటు చేస్తున్నామని సీఎం మనోహర్లాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పశుగ్రాసానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఎక్కడ ఏర్పాట్లు చేయవచ్చో చూసి.. లేకుంటే ఇతర జిల్లాల నుంచి కూడా మేతను కొనుగోలు చేస్తామని చెప్పారు. హిమాచల్ప్రదేశ్(Himachal Pradesh), పంజాబ్(Punjab) నుంచి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నందున రాష్ట్రంలో వరదలు తలెత్తాయని సీఎం మనోహర్లాల్ తెలిపారు. కొన్ని చోట్ల ఏళ్ల తరబడి రికార్డులు బద్దలయ్యాయి. అంబాలా, పచ్చంకుల, కురుక్షేత్ర, కర్నాల్, యమునానగర్, పానిపట్, కైతాల్ 7 జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సహాయ, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.
