బీహార్‌లోని ఓ పాఠశాలల్లో పిస్టల్‌ క‌ల‌క‌లం రేపింది. ఇద్దరు బాలికలు పిస్టల్‌తో పాఠశాలకు వెళ్లారు.

బీహార్‌లోని ఓ పాఠశాలల్లో పిస్టల్‌ క‌ల‌క‌లం రేపింది. ఇద్దరు బాలికలు పిస్టల్‌తో పాఠశాలకు వెళ్లారు. అర్వాల్ జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు గురువారం బ్యాగ్‌లో పిస్టల్ పెట్టుకుని పాఠశాలకు వచ్చారు, ఈ విషయంపై బ‌య‌ట‌కు రావ‌డంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తిపై నగర తెల్ప పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కర్పి బ్లాక్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో 7.64 బోర్‌తో కూడిన ఖాళీ పిస్టల్‌ను పాఠ‌శాల‌కు తీసుకుని వచ్చారు. క్లాసులో పిస్టల్ తీసి స్టూడెంట్స్ కి చూపించడం మొదలుపెట్టారు. ఇది చూసి చాలా మంది అమ్మాయిలు భయపడ్డారు. కొద్దిసేపటికే ప్రధానోపాధ్యాయుడికి కూడా విషయం తెలిసింది. ప్రధానోపాధ్యాయుడు దర్యాప్తు ప్రారంభించాడు, అప్పుడు ఇద్దరు విద్యార్ధినులు వారి స్నేహితులలో ఒకరి బ్యాగ్‌లో పిస్టల్‌ను ఉంచి ఆమెను ఇంటికి పంపారు. సెలవు పెట్టకుండా విద్యార్థి ఇంటికి వెళ్లడంతో ప్రధానోపాధ్యాయుడికి అనుమానం వచ్చి వెంటనే విద్యార్థిని తండ్రి, సోదరుడికి సమాచారం అందించి పాఠశాలకు పిలిపించారు. అలాగే 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకతో విద్యార్థిని కుటుంబ‌స‌భ్యులు పిస్టల్‌ను ఇంటి సమీపంలోని ఓ గోతిలో విసిరారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ముగ్గురు విద్యార్ధినులను ప్రధానోపాధ్యాయుడు, పోలీసులు విచారించి.. తీవ్రంగా మందలించారు. స్వాధీనం చేసుకున్న పిస్టల్‌పై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ తెలిపారు. ఈ విషయమై పోలీసులు నగర తెల్పా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఆయుధాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పలు అంశాలపై విచారణ ప్రారంభించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story