ఓ యువకుడికి తన పుట్టినరోజే(Birthday) మృత్యువాత పడ్డాడు. ఇందుకు కారణం బీరు(Beer) విషయంలో స్నేహితుల(Friends) మధ్య గొడవ జరగడమే.

ఓ యువకుడికి తన పుట్టినరోజే(Birthday) మృత్యువాత పడ్డాడు. ఇందుకు కారణం బీరు(Beer) విషయంలో స్నేహితుల(Friends) మధ్య గొడవ జరగడమే. పుట్టిన రోజు వేడుకలు విషాదంగా ముగిశాయి. స్నేహితులే ఆ యువకుడి పాలిట యమకింకరులయ్యారు. తన పుట్టిన రోజున ఎవరినైతే పిలిచి పార్టీ చేసుకున్నాడో వాళ్లే అతని మృతికి కారకులయ్యారు. మహారాష్ట్రలోని(Maharashtra) ఠాణె జి్లా ఉల్హాస్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

ఠాణె జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన కార్తీక్ అనే 23 ఏళ్ల యువకుడిది గత నెల 27న పుట్టినరోజు ఉంది. ఇందుకు తన ముగ్గురు స్నేహితులను పిలిచి పార్టీ చేసుకుందామనుకున్నాడు. ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు. అయితే ఒక్క బీరు విషయంలో వీరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. ఆగ్రహం చెందిన ముగ్గురు స్నేహితులు బర్త్ డే బాయ్‌ను నాలుగో అంతస్తు నుంచి కిందికి తోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్‌ను కిందికి తోసిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకుని పోలీసులు విచారించగా ఈ ఉదంతం బయటపడింది. నిందితులు ధీరజ్, సాగర్, నీలేష్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story