ఢిల్లీ మెట్రో రైలులోపల ఫైట్ జ‌రిగింది. ఆ వీడియో వైరల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది

ఢిల్లీ మెట్రో రైలులోపల ఫైట్ జ‌రిగింది. ఆ వీడియో వైరల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరూ ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆ మెట్రో కోచ్‌లో కలకలం రేగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

షాహీద్ స్థల్ (కొత్త బస్టాండ్) వద్ద ఉన్న మెట్రో స్టేషన్ వద్ద రెడ్ లైన్ మెట్రో (ఢిల్లీ మెట్రో)లో ఇద్దరు యువకుల మధ్య సీటు విషయంలో వివాదం జరిగింది. వాగ్వాదం సందర్భంగా ఓ యువకుడు తనను తాను క్రైం బ్రాంచ్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొంటూ గొడవకు దిగాడు. మ‌రో యువకుడు అతని కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ కొట్టుకోవడానికి గ‌ళ్లాలు ప‌ట్టుకున్నారు. అయితే కొంత మంది జోక్యం చేసుకున్నారు. కొంత మంది ప్రయాణికులు ఎలాగోలా వారిద్దరినీ శాంతింపజేసి వేర్వేరుగా కూర్చోబెట్టారు. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న ఇతర వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story