కర్ణాటకలో(Karnataka) దారుణం చోటు చేసుకుంది. హవేరీ(Haveri) జిల్లా రాణేబెన్నూరు తాలూకా అరెమల్లాపూర్‌ గ్రామానికి చెందిన మంజునాథ(Manjunath) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన పూజ(Pooja) అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది.

కర్ణాటకలో(Karnataka) దారుణం చోటు చేసుకుంది. హవేరీ(Haveri) జిల్లా రాణేబెన్నూరు తాలూకా అరెమల్లాపూర్‌ గ్రామానికి చెందిన మంజునాథ(Manjunath) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన పూజ(Pooja) అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. అలా రెండేళ్లపాటు ప్రేమించుకున్న వారు ఓ ఫైన్‌ మార్నింగ్‌ ఊరు వదిలి పారిపోయారు. దీంతో యువతి కుటుంబం ఆగ్రహం చెందింది. మంజునాథ ఇంటికి వెళ్లి అతడి తల్లి హనుమవ్వపై దాడి చేసింది. దారుణంగా కొట్టి అవమానించింది. ఇంట్లోంచి వీధిలోకి లాక్కొచ్చి విద్యుత్‌ స్తంభానికి(Electric poll) కట్టేసి కొట్టారు పూజ తరఫు బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత మహిళను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని 324, 354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Updated On 4 May 2024 3:24 AM GMT
Ehatv

Ehatv

Next Story