భారతదేశంలో మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో

భారతదేశంలో మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో భారతదేశం గురువారం నాడు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనుంది. పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ రూట్-ఇ-హిలాల్ కమిటీ షవ్వాల్ నెలవంక దర్శనం విషయంపై చర్చించడానికి నెలవారీ సమావేశాన్ని నిర్వహించింది. చంద్రుని దర్శనాన్ని బట్టి భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ తేదీని ప్రకటించడం ఈ కమిటీ బాధ్యత.

నెలవంక కనిపించనందున భారతీయ ముస్లింలు ఈ రోజు ఏప్రిల్ 10న మరో ఉపవాస దినాన్ని పాటిస్తారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని కీలక మసీదులు దీనిని ధృవీకరించాయి. ఏప్రిల్ 11నే దేశంలో చాలా ప్రాంతాల్లో ఈద్ అల్-ఫితర్ ను జరుపుకుంటారు. ఇక షవ్వాల్ నెలవంక కనిపించడంతో జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నట్లు మంగళవారం ప్రకటించారు. పశ్చిమాసియాలోని అనేక ఇస్లామిక్ దేశాలు ఏప్రిల్ 10న పండుగను జరుపుకోనున్నాయి. సౌదీ అరేబియా, UAE.. ఇతర దేశాలలో ఏప్రిల్ 9న షవ్వాల్ చంద్రుడు కనిపించాడు. పాకిస్థాన్‌లో ఏప్రిల్ 10న ఈద్ జరుపుకుంటున్నారు.

Updated On 9 April 2024 8:53 PM GMT
Yagnik

Yagnik

Next Story