ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులో జనవరి 18న విచార‌ణ‌కు హాజరు కావాలని సీఎంను ఆదేశించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(CM Aravind Kejriwal)కు ఈడీ(Enforcement Directorate) నాలుగో సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులో జనవరి 18న విచార‌ణ‌కు హాజరు కావాలని సీఎంను ఆదేశించింది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మూడుసార్లు సమన్లు ​​జారీ చేసింది.. కానీ ఆయ‌న‌ ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. మూడుసార్లు స‌మ‌న్ల‌ను ధిక్క‌రించ‌డంతో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు(Arrest) చేస్తుంద‌ని అంతా భావించారు. కానీ మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది.

జనవరి 3న అరవింద్ కేజ్రీవాల్‌కు మూడోసారి సమన్లు ​​పంపగా.. ఆ నోటీసులను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో ఆయ‌న‌పై ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ మూడు సార్లు సమన్లను పంపించిన పట్టించుకోలేదు ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు.

ఈడీ ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3న విచారణలో పాల్గొనాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. తొలి సమన్ల స‌మ‌యంలో కేజ్రీవాల్ ఎన్నికల సమావేశానికి వెళ్లగా.. రెండోసారి విపాసన కోసం వెళ్లారు.. మూడో సారి నోటీసులను పట్టించుకోలేదు. దీంతో నాలుగోవ సారి సమన్లు(ED summons) జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన తప్పకుండా ఈడీ ముందుకు రావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొంది.

Updated On 12 Jan 2024 10:29 PM GMT
Yagnik

Yagnik

Next Story