దేశ రాజ‌ధానిలోని ఓ స్కూల్‌కు బాంబ్ బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీలోని పుష్ప విహార్‌లోని అమృత స్కూల్‌కు మంగళవారం ఉదయం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వ‌చ్చింది.

దేశ రాజ‌ధానిలోని ఓ స్కూల్‌కు బాంబ్ బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీ(Delhi)లోని పుష్ప విహార్‌(Pushp Vihar)లోని అమృత స్కూల్‌(Amrita School)కు మంగళవారం ఉదయం మెయిల్(Mail) ద్వారా బాంబు బెదిరింపు(Bomb Threat)వ‌చ్చింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్‌ పాఠశాలకు చేరుకుని సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించిన పోలీసులు.. పాఠశాలలో త‌నిఖీలు చేప‌ట్టారు.

మెయిల్ అందడంతో పాఠశాలలో చెకింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు దక్షిణ జిల్లా డీసీపీ చందన్ చౌదరి తెలిపారు. అన్నిచోట్లా తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి ఎవరి ద్వారా పంపబడిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

Updated On 15 May 2023 11:27 PM GMT
Yagnik

Yagnik

Next Story