దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) రూ. కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను(cocaine ) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) రూ. కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను(cocaine ) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలో రైడ్ చేసిన తర్వాత డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆదివారం నాడు 400 గ్రాముల హెరాయిన్ మరియు 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులను అరెస్టు చేసిన తర్వాత దేశ రాజధానిలో తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది.అదే రోజు ఢిల్లీ కస్టమ్స్ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుండి రూ.24 కోట్ల విలువైన 1,660 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రయాణీకుడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా జాతీయుడు, అతను దుబాయ్ నుండి ఢిల్లీకి చేరుకున్నాడు. NDPS చట్టం 1985 కింద అతన్ని అరెస్టు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story