ఇటీవల రాజధాని ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ అనే యువతీ హత్య కేసులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వారిది సహజీవనం కాదు, వివాహ బంధం అని కేసు విచారణలో తేలింది. అసలు హత్య ఏవిధంగా జరిగిందో అనే కారణాలు బయటపడ్డాయి. భాదిత మహిళా నిక్కీ ని తన భర్త సాహిల్ ఛార్జింగ్ వైర్ మీదకి బిగించి కార్ లో హత్య చేసినట్లు పోలీసులు విచారణలో చెప్పటం జరిగింది . ఇప్పటివరకు వాళ్లిదరు సహజీవనం లో ఉన్నారనే […]

ఇటీవల రాజధాని ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ అనే యువతీ హత్య కేసులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వారిది సహజీవనం కాదు, వివాహ బంధం అని కేసు విచారణలో తేలింది. అసలు హత్య ఏవిధంగా జరిగిందో అనే కారణాలు బయటపడ్డాయి.

భాదిత మహిళా నిక్కీ ని తన భర్త సాహిల్ ఛార్జింగ్ వైర్ మీదకి బిగించి కార్ లో హత్య చేసినట్లు పోలీసులు విచారణలో చెప్పటం జరిగింది . ఇప్పటివరకు వాళ్లిదరు సహజీవనం లో ఉన్నారనే వార్తలు అవాస్తం అని తెలిసాయి . నిక్కీ సాహిల్ కు 2020లో నోయిడాలోని ఆర్య సమాజ్‏లో వివాహం జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వారి మ్యారేజ్ సర్టిఫికెట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . అయితే నిక్కీని పెళ్లి చేసుకోవడం సాహిల్ కుటుంబానికి ఇష్టం లేదు అని తెలిసింది . దానితో ఈ హత్యతో వారి కుటంబానికి ,ఇతర స్నేహితులకు ఏమైనా సంబంధం ఉండవచ్చు అనే కోణం లో విచారిస్తూ ఉండగా అసలు నిజాలు బయట పడ్డాయి. సాహిల్ మర్డర్ చేయటానికి సహకరించిన సాహిల్ తండ్రి ,మరో ముగ్గురు కుటుంబ సభ్యులని పోలీసులు అరెస్ట్ చేసారు.

నిక్కీ సాహిల్ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల ఇష్టం లేకుండానే వివాహం చేసుకున్నారు. కొన్ని ఏళ్ళ మంచిగా సాగింది వాళ్ళ కాపురం . ఆ తర్వాత సాహిల్ బుద్ధి మారింది .తన కుటుంబ సహకారం‏తో వేరే అమ్మాయి తో ఎంగేజ్మెంట్ కి సిద్ధం అయ్యాడు. ఈ విషయం తెలిసిన నిక్కీ భర్త సాహిల్ ని నిలదీసినది . నిక్కీ ని కార్ లో బయటకు తీసువెళ్ళాడు సాహిల్ .చాల ప్రదేశాలు తిరిగారు . ఆ సందర్భంలో నిక్కీ సాహిల్ మధ్య జరిగిన వివాదంలో వాదనలు ఎక్కువ కావటంతో సాహిల్ నిక్కీ ఛార్జింగ్ వైర్ మెడకు బిగించి హత్య చేసాడు. ఆ తరవాత తన దగ్గర బంధువు సహాయం తో నిక్కీ శవాన్ని సోహిల్ సొంత ఫామిలీ ధాబా లో ఫ్రిడ్జ్ లో ఉంచటం జరిగింది. సౌథ్ ఢిల్లీలో ఒక ఇంట్లో నిక్కీ ఒంటరిగా నివాసం ఉండేది. సాహిల్ అక్కడికి వస్తు ఉండేవాడు అని అక్కడ స్థానికులు చెప్పటం జరిగింది . హత్యా జరిగిన ప్రదేశం ఆ ఇంటికి దగరలో నే ఉండటం విశేషం. ఇంటి దగ్గర సాహిల్ నిక్కీల సీసీ టీవీ దృశ్యాలని కూడా పోలీసులు సొంతం చేసుకున్నారు. ఇప్పటికి ఈ కేసులో మొత్తం 5 గురు నిందితులని అరెస్ట్ చేయటం జరిగింది..

ఢిల్లీలో జరిగిన దారుణాల్లో ఇది రెండవది. సంవత్సరం క్రితం శ్రద్ద వాకర్ అనే మహిళని తన భర్త అఫ్తాబ్ ముక్కులాగా కోసి ఫిడ్జి లో దాచిన వైనం ని తలపించేలా ప్రస్తుత దృశ్యాలు ఉన్నాయని వివరించారు పోలీసులు .నిందితులకు కఠిన శిక్ష పడుతుందని తెలిపారు.

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story