ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హౌరా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 7.20 గంటలకు బహనాగా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్ర‌మాదంలో 280 మంది మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు.

ఒడిశా(Odisha)లోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హౌరా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్(Bengaluru-Howrah Superfast Express) శుక్రవారం సాయంత్రం 7.20 గంటలకు బహనాగా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్ర‌మాదంలో 280 మంది మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లా(Balasore) పరిధిలోని బహనాగా స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ఈ ప్రమాదం సంభ‌వించింది.

ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్‌(Ashwini Vaishnaw).. ఇది బాధాకరం అని అన్నారు. రైల్వే, NDRF, SDRF, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. నష్టపరిహారాన్ని నిన్న ప్రకటించారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. రైల్వే సేఫ్టీ కమీషనర్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలేమిటనే దానిపై విచారణ చేయనున్నారని పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి(Railway Minister) అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

ఖరగ్‌పూర్(Kharagpur) డీఆర్‌ఎం ప్ర‌మాదంపై స్పందిస్తూ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కూడా కోల్‌కతా పర్యటనను మధ్యలోనే వదిలి రైలు ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు.

Updated On 2 Jun 2023 9:57 PM GMT
Yagnik

Yagnik

Next Story