తమిళనాడు(Tamil Nadu) కన్యాకుమారి జిల్లా పూదప్పాండిలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఆగడాలు భరించలేక కూతురు అతడిని చంపేసింది. వివరాల్లోకి వెళితే 46 ఏళ్ల సురేశ్‌కుమార్‌కు ఇద్దరు కూతుళ్లు. సురేశ్‌కు తాగుడు అలవాటు ఉంది. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. సహనం కోల్పోయిన భార్య చిన్న కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

తమిళనాడు(Tamil Nadu) కన్యాకుమారి జిల్లా పూదప్పాండిలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఆగడాలు భరించలేక కూతురు అతడిని చంపేసింది. వివరాల్లోకి వెళితే 46 ఏళ్ల సురేశ్‌కుమార్‌కు ఇద్దరు కూతుళ్లు. సురేశ్‌కు తాగుడు అలవాటు ఉంది. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. సహనం కోల్పోయిన భార్య చిన్న కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సురేశ్‌కుమార్‌తో పెద్ద కూతురు ఉంటోంది. ఏప్రిల్‌ 26వ తేదీన సురేశ్‌కుమార్‌ అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు మద్యం మత్తులో తన తండ్రి చనిపోయినట్టు కూతురు తెలిపింది. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అతడి తలకు గాయాలు అయినట్టు తేలింది. దాంతో కూతురు ఆర్తిని పోలీసులు విచారించారు. ఆమె తన తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించింది. మద్యం మత్తులో ప్రతి రోజు గొడవపడేవాడని, ఘటనకు ముందు కూడా తనపై దాడికి ప్రయత్నించాడని తెలిపింది. అతడిని నెట్టివేయడంతో గోడకు తల తగిలి గాయం ఏర్పడిందని చెప్పింది. మరునాడు తనతో అసభ్యకరంగా మాట్లాడటంతో గొంతు నులిమినట్టు తెలిపింది. బుధవారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

Updated On 2 May 2024 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story