లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది.

లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలావుండగా.. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఇందులో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టో ఖరారు కానుంది.

ఉదయం 10 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుందని సమాచారం. వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. అదే సమయంలో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలని భావిస్తున్నారు. ఈ న్యాయ యాత్ర జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమై మార్చి 17న ముంబైలో ముగిసింది.

గతంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ డియో ఉన్నారు. ఇతర సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, శశి థరూర్, ప్రియాంక గాంధీ వాద్రాలు ఉన్నారు. కమిటీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ నేత పి చిదంబరం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో 'ప్రజల మేనిఫెస్టో'గా ఉంటుందని చెప్పారు. పార్టీ నేతలు ప్రజలతో సంప్రదింపులు జరపడమే కాకుండా.. ఈ-మెయిల్, వెబ్‌సైట్ ద్వారా సూచనలు తీసుకున్నారు.

కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు వేర్వేరు జాబితాల్లో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచేందుకు, సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల గణనను ఆమోదింపజేసేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.

Updated On 18 March 2024 10:21 PM GMT
Yagnik

Yagnik

Next Story