ప్రముఖ కాంగ్రెస్(congress) నేత పి. చిదంబరం(P.Chidambaram) కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను(Anurag Thakur) లక్ష్యంగా చేసుకుని సుదీర్ఘ ట్వీట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ లలో మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని అంగీకరిస్తాం.. అయితే మణిపూర్‌లో కొనసాగుతున్న హింసతో వీటిని ఎలా పోల్చగలరని ఆయన అన్నారు.

ప్రముఖ కాంగ్రెస్(congress) నేత పి. చిదంబరం(P.Chidambaram) కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను(Anurag Thakur) లక్ష్యంగా చేసుకుని సుదీర్ఘ ట్వీట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ లలో మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని అంగీకరిస్తాం.. అయితే మణిపూర్‌లో కొనసాగుతున్న హింసతో వీటిని ఎలా పోల్చగలరని ఆయన అన్నారు.

రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, రాజేంద్ర గూడాను(Rajendra Gowda) మంత్రి పదవి నుండి తొలగించినందుకు అనురాగ్ ఠాకూర్.. అశోక్‌ గెహ్లాట్(Ashok Gehlot) ప్రభుత్వంపై దాడి చేశారు. మహిళలపై జరిగే నేరాల్లో రాజస్థాన్‌ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లలో ఇక్కడ మహిళలపై 1.09 లక్షల నేరాలు జరిగాయి. దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో 22% రాజస్థాన్‌కు చెందినవే. ఆ తర్వాత కూడా నేరస్థులపై చర్యలు తీసుకోకుండా సీఎం అశోక్ గెహ్లాట్.. రాజేంద్ర గూడాను మంత్రి పదవి నుంచి తప్పించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రాజేంద్ర గూఢా స్వరం వినిపించారు. దీంతో పాటు బీహార్ నితీష్ ప్రభుత్వంపై కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు. మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో బీహార్ కూడా చేరిందన్నారు.

ఈ ప్రకటనపై చిదంబరం స్పందిస్తూ.. బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగాయని అంగీకరిస్తున్నప్ప‌టికీ.. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసతో ఎలా పోలుస్తారు? అని ప్ర‌శ్నించారు. లోయలో కుకీలు ఏమైనా మిగిలి ఉన్నారా అని అడిగారు. మణిపూర్‌లోని చురచంద్‌పూర్, ఇతర కొండ జిల్లాలలో మొయిటీలు ఎవరైనా మిగిలి ఉన్నారా? అని ప్ర‌శ్నించారు. నివేదికలు నిజమైతే.. మణిపూర్‌లో జాతి ప్రక్షాళన దాదాపు పూర్తయిందని ఆయన అన్నారు. ఆబ్జెక్టివ్ అంచనా ప్రకారం.. మణిపూర్‌లో రాజ్యాంగ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రుల పాలన ఇళ్లు, కార్యాలయాలకు మించి సాగడం లేదు. మణిపూర్‌లో పరిస్థితిని బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌ల పరిస్థితులతో ఎలా పోల్చగలమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థత, పక్షపాత వైఖరి అవలంబించడమే కాకుండా.. పొంతనలేని పోలికల ముసుగులో నిర్మొహమాటంగా వ్యవహరిస్తోందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్రాల్లో కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని.. అయితే మణిపూర్‌లో జరుగుతున్న విధ్వంసాలను క్షమించలేమని ఆయన అన్నారు. మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని.. భారత ప్రభుత్వం స్వీయ ప్రేరేపిత కోమాలో ఉందని విమ‌ర్శించారు.

Updated On 23 July 2023 2:52 AM GMT
Ehatv

Ehatv

Next Story