భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ (Congress) పార్టీకే దక్కుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) నాగపూర్‌లో పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ (Congress) పార్టీకే దక్కుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) నాగపూర్‌లో పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మంత్రి జూపల్లి ఓ ప్రకటనలో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో సగర్వంగా నిలబడింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాల వలన అని చెప్పక తప్పదని మంత్రి జూపల్లి అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని.. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని..రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా దేశంలో అలజడి సృష్టించేందుకు బీజేపీ (BJP) ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల అందరి ఐక్యత ,సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, అదే స్ఫూర్తితో కేంద్రంలో కుడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated On 28 Dec 2023 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story