రాష్ట్రంలోని 25 లక్షల మంది యువతకు త్వరలో ఉచిత స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం అందజేయనుంది. స్వామి వివేకానంద యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఈ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందించనున్నారు. 3600 కోట్లతో ఫోన్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

CM Yogi gift to the youth 24 lakh students will get smartphones
రాష్ట్రంలోని 25 లక్షల మంది యువతకు త్వరలో ఉచిత స్మార్ట్ ఫోన్లు(Smartphones) ప్రభుత్వం అందజేయనుంది. స్వామి వివేకానంద యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్(Swami Vivekananda Youth Empowerment Scheme) కింద ఈ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందించనున్నారు. 3600 కోట్లతో ఫోన్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువత సాంకేతికంగా సాధికారత సాధించేందుకు యోగి(Yogi Adityanath) ప్రభుత్వం ఈ బలమైన చర్య తీసుకుంది. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అభ్యసిస్తున్న యువతకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద స్మార్ట్ ఫోన్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉచితంగా స్ప్రింగ్బోర్డ్ ప్లాట్ఫారమ్(Springboard Platform) ను అందిస్తుంది. దీని సహాయంతో 3,900 కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఆన్లైన్ కోర్సుల సహాయంతో, విద్యార్థులు తమ కెరీర్ను మెరుగైన మార్గంలో పెంచుకోగలుగుతారు. ఇది మాత్రమే కాదు.. వారు చదువుతున్న కోర్సు, ఆన్లైన్ కోర్సు మెటీరియల్ను సులభంగా సేకరించగలుగుతారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర పథకాలను సులభంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. సాంకేతికంగా నైపుణ్యం ఉన్న యువత ఉద్యోగాలు పొందడం.. వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా సులభం అవుతుంది. స్వామి వివేకానంద యువజన సాధికారత పథకాన్ని ఐదేళ్లుగా అమలు చేస్తుంది ప్రభుత్వం.
