లోక్‌సభ ఎన్నికల(Lok sabha elections) ముందు కర్ణాటక(Karnataka) ప్రభుత్వం మరో వివాదానికి తెర తీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ఆలయాలపై పన్నులు వేశారు. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించడానికి ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కోటి రూపాయలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాలు ప్రభుత్వానికి పది శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.

లోక్‌సభ ఎన్నికల(Lok sabha elections) ముందు కర్ణాటక(Karnataka) ప్రభుత్వం మరో వివాదానికి తెర తీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ఆలయాలపై పన్నులు వేశారు. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించడానికి ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కోటి రూపాయలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాలు ప్రభుత్వానికి పది శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు అయిదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త ఎండోమెంట్స్ బిల్లుపై రాష్ట్ర బీజేపీ(BJP) తీవ్రంగా మండి పడింది. సిద్ధరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించడం ద్వారా తన ఖాళీ ఖజానాను నింపుకోవాలని చూస్తున్నదని విమర్శించింది. కేవలం హిందూ దేవాలయ ఆదాయాల పైనే ప్రభుత్వం ఎందుకు పన్ను విధిస్తున్నదో చెప్పాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక మంత్రి రామలింగా రెడ్డి సమర్థించుకున్నారు. ప్రభుత్వం ఆలయాల సొమ్ము తీసుకోవడం లేదన్నారు. ఇలా సేకరించిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగిస్తామని అన్నారు. పేద అర్చకులకు ఆర్థిక సాయం, చిన్న దేవాలయాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అప్పట్లో బీజేపీ ప్రభుత్వం కూడా అయిదు లక్షల నుంచి పాతిక లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలపై అయిదు శాతం పన్ను, 25 లక్షలు పైబడి ఆదాయం ఉన్న వాటిపై 10 శాతం పన్ను విధించిందని గుర్తు చేశారు.

Updated On 22 Feb 2024 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story