తాను అమ్మ కడుపున జన్మించలేదని, ఓ బలమైన కారణం కోసం పరమాత్ముడే తనను ఈ భూమ్మీదకు పంపించాడని ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi) చేసిన వ్యాఖ్యలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) సెటైర్లు విసిరారు. దేవుళ్లు రాజకీయాలు చేయకూడదని, హింసను ప్రేరేపించకూడదని మమత అన్నారు.

తాను అమ్మ కడుపున జన్మించలేదని, ఓ బలమైన కారణం కోసం పరమాత్ముడే తనను ఈ భూమ్మీదకు పంపించాడని ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi) చేసిన వ్యాఖ్యలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) సెటైర్లు విసిరారు. దేవుళ్లు రాజకీయాలు చేయకూడదని, హింసను ప్రేరేపించకూడదని మమత అన్నారు. ఒకవేళ నరేంద్రమోదీ తనకు తాను దేవుడిగా భావిస్తే ఆయన కోసం చక్కటి గుడి కడతామని, ఆయన అక్కడే ఆసీనులవ్వొచ్చని, ఆ విధంగానైనా దేశాన్ని ఇబ్బంది పెట్టడం ఆగిపోతుందని అన్నారు. మోదీ దేవుళ్లకే దేవుడని ఓ అంధభక్తుడు అంటే, జగన్నాథుడే మోదీ భక్తుడు అని ఓ బీజేపీ(BJP) నేత అంటున్నారని, ఒకవేళ ఆయన దేవుడే అయితే ఆయన రాజకీయాలు చేయవద్దని, అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టవద్దని మమత చెప్పారు. మోదీ కోసం ఆల‌యాన్ని నిర్మిస్తామ‌ని, అక్క‌డ ఆయనను పూజిస్తామ‌ని, నైవేద్యం, పువ్వులు స‌మ‌ర్పిస్తామ‌ని, ఆయ‌న‌కు దోక్లా కూడా నైవేద్యం పెడతామని మమతా బెనర్జీ అన్నారు.

Updated On 29 May 2024 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story