రేపు జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఒకరికొకరు బద్ద ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీలు చండీగఢ్లో ఇలా పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి

Chandigarh mayoral polls set to be first INDIA vs BJP election test
రేపు జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నిక(Chandigarh Mayor Election )ల్లో బీజేపీ(BJP)ని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party)లు కూటమిగా ఏర్పడ్డాయి. ఒకరికొకరు బద్ద ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీలు చండీగఢ్లో ఇలా పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి. లోక్సభ ఎన్నికల కోసం కాకుండా మేయర్ ఎన్నికల కోసమే ఈ కూటమి ఏర్పడింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా(Raghav Chaddha) ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండియా కూటమిలో భాగంగా ఈ పొత్తు పొడిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్(Kuldeep Kumar)కు మద్దతుగా కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి జస్బీర్ సింగ్(Jasbeer Singh) బంటీ తన పేరును ఉపసంహరించుకున్నారు. దీంతో కుల్దీప్ బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్(Manoj Sonkar)తో తలపడనున్నారు. ఆప్కి మేయర్ పదవి దక్కడంతో కాంగ్రెస్కు సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. సీనియర్ డిప్యూటీ మేయర్ పదవి నుంచి ఆప్కి చెందిన నేహా(Neha), డిప్యూటీ మేయర్ పదవి నుంచి పూనమ్ కాంగ్రెస్ అభ్యర్థులు గురుప్రీత్ సింగ్ గబీ, నిర్మలా దేవి(Nirmala Devi)లకు మద్దతుగా తమ పేర్లను ఉపసంహరించుకున్నారు.
సీనియర్ డిప్యూటీ మేయర్ స్థానానికి బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధూ కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గాబీతో, రాజేంద్ర శర్మ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవితో తలపడనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్ఎస్ లక్కీ, ఆప్ కో-ఇన్చార్జి డాక్టర్ ఎస్ఎస్ అహ్లువాలియా ఆధ్వర్యంలో మూడు స్థానాలకు గానూ రెండు పార్టీల అభ్యర్థులు తమ పేర్లను ఉపసంహరించుకునేందుకు సెక్టార్-17 మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. జాయింట్ సెక్రటరీ గురిందర్ సింగ్ సోధి సెలవులో ఉన్నందున, ఆయన వ్యక్తిగత సహాయకుడు నామినేషన్ల ఉపసంహరణకు దరఖాస్తులు తీసుకున్నారు.
మేయర్ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్ కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం దేశానికి భిన్నమైన సందేశాన్ని అందించాయి. బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు ఏకమయ్యాయి. మేయర్ పదవి విషయంలో కాంగ్రెస్ మీకు మద్దతు ఇస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కౌన్సిలర్లు గెలుచుకుంటారు. మేయర్ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇది కొత్త ప్రారంభం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ అత్యధిక సంఖ్యలో కౌన్సిలర్లను గెలుచుకుంది. కానీ బీజేపీ మాత్రం మోసం చేసి లాబీయింగ్ చేసి రెండేళ్లుగా మూడు పదవులను కైవసం చేసుకుంది. ఇది భవిష్యత్తులో జరగదు. ఆప్ సభ్యులు మేయర్ అవుతారు. ప్రజలు కూడా బిజెపిని తిరస్కరించారు. బీజేపీ చేసిన దానికి ఆప్, కాంగ్రెస్ కలిసి ప్రతీకారం తీర్చుకుంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
