పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions)జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం అయ్యి 23 రోజుల పాటు అంటే ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions)జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేయనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం అయ్యి 23 రోజుల పాటు అంటే ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించారు.

వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల దృష్ట్యా వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యూనిఫాం సివిల్ కోడ్ (UCC), ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డినెన్స్, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస, LAC పై చైనీస్ చొరబాటు వంటి అంశాల‌పై తీవ్ర‌మైన చ‌ర్చ అవ‌కాశం ఉండవచ్చు.

యుసీసీపై కేంద్రం ఇంకా అధికారిక చర్చను ప్రారంభించలేదు. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ కూడా జరగలేదు. అయితే యూసీసీపై కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేగాన్ని పెంచింది. వర్షాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును తీసుకురావాలనే చర్చ.. విపక్షాలను అప్రమత్తం చేసింది. యూసీసీ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు.

Updated On 6 July 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story