ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liqour case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(MLC Kavitha) నిందితురాలిగా సీబీఐ(CBI) చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు(CBI Notices) జారీ చేసింది.

MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liqour case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(MLC Kavitha) నిందితురాలిగా సీబీఐ(CBI) చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు(CBI Notices) జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాలని తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో(Arvind Kejrival) పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కేసులో ఇప్పటికే కవితను మూడుసార్లు సీబీఐ విచారించింది. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.
