వరుసకు వారిద్దరు అన్నాచెల్లెలవుతారు. కానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొదిలి ఒకరు ఉండలేని పరిస్థితి. పెళ్లి చేసుకోవడానికి వరుస కుదరదు. ఇంట్లో విషయం తెలిస్తే ఒప్పుకోరని భయం. పెళ్లితో ఒక్కటి కాలేమని తెలుసుకుని కనీసం చావుతోనైనా ఒక్కటవుదామనుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మహోబాజిల్లాలో జరిగింది. ప్రేమికుల రోజైన(Valentine's day) ఫిబ్రవరి 14వ తేదీనే ఈ విషాదం చోటు చేసుకుంది.

వరుసకు వారిద్దరు అన్నాచెల్లెలవుతారు. కానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొదిలి ఒకరు ఉండలేని పరిస్థితి. పెళ్లి చేసుకోవడానికి వరుస కుదరదు. ఇంట్లో విషయం తెలిస్తే ఒప్పుకోరని భయం. పెళ్లితో ఒక్కటి కాలేమని తెలుసుకుని కనీసం చావుతోనైనా ఒక్కటవుదామనుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మహోబాజిల్లాలో జరిగింది. ప్రేమికుల రోజైన(Valentine's day) ఫిబ్రవరి 14వ తేదీనే ఈ విషాదం చోటు చేసుకుంది. మ‌హోబా(Mahoba) జిల్లాలోని చ‌ర్‌ఖ‌రి ఏరియాకు చెందిన 22 ఏళ్ల సురేంద్ర‌ వ‌రుస‌కు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా సురేంద్రను ప్రేమించసాగింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన వారిద్దరు అందులోంచి బయటకు రాలేకపోయారు. సురేంద్ర త‌న పొలంలో పురుగుల మందు సేవించి చనిపోగా, ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా పురుగుల మందు తాగింది. సురేంద్ర‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అమ్మాయిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చనిపోయింది. వారిద్దరు చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసి చ‌దువుకున్నారు. కాలేజీలో కూడా క‌లిసి చ‌దువుకున్నారు. అయితే వీరు ప్రేమ‌లో ఉన్న‌ట్లు వారి కుటుంబాల‌కు తెలియ‌దు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On 15 Feb 2024 8:00 AM GMT
Ehatv

Ehatv

Next Story