బీహార్‌లో మరో వంతెన కూలింది. 15 రోజుల్లో ఐదో వంతెన కూలడంతో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బీహార్‌లో మరో వంతెన కూలింది. 15 రోజుల్లో ఐదో వంతెన కూలడంతో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సివాన్‌లో వంతెన కూలిపోయింది. మహారాజ్‌గంజ్ సబ్‌డివిజన్‌లోని పటేధా గ్రామం, డియోరియా గ్రామం మధ్య గండక్ నదిపై నిర్మించిన 35 ఏళ్ల నాటి వంతెన ఒక అడుగు మునిగిపోవడం ప్రారంభమైంది. ఆ త‌ర్వాత కొద్దిసేపటికే వంతెన గండక్ నదిలో మునిగిపోయింది. ప్రమాదం తర్వాత పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో గంద‌ర‌గోళం నెలకొంది. ఈ వంతెన 35 ఏళ్ల నాటిదని ప్రజలు చెబుతున్నారు. వేలాది మందికి ఇదే ఏకైక రవాణా మార్గం. ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

ఈ ప్రమాదానికి ముందు జూన్ 22 న మహారాజ్‌గంజ్ సబ్ డివిజన్‌లోని పటేధా-గరౌలి గ్రామాల మధ్య గండక్ కాలువపై వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం తర్వాత రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జూన్ 28న మధుబనిలో మ‌రో వంతెన కూలంది. లాల్వార్హి మధుబని జిల్లాలోని మాధేపూర్ బ్లాక్‌లోని భేజా కోషి డ్యామ్ చౌక్ నుండి మహాపతియా ప్రధాన రహదారికి సమీపంలో ఈ వంతెన ఉంది. వంతెన‌కు షట్టరింగ్‌ పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బాలన్ నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ప్రవాహంలో వంతెన‌ కొట్టుకుపోయింది.

జూన్ 23న తూర్పు చంపారన్‌లోని ఘోరసహన్ బ్లాక్‌లో రూ.1.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. ఘోరసహన్‌ బ్లాక్‌ అమావా నుంచి చైన్‌పూర్‌ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై నిర్మిస్తున్న వంతెన కాస్టింగ్‌ పనులు చాలా రోజులుగా కొనసాగుతున్నాయని ప్రజలు తెలిపారు. రాత్రి అకస్మాత్తుగా 40 అడుగుల పొడవైన భాగం పడిపోయింది.

జూన్ 18న అరారియా జిల్లాలోని సిక్తి బ్లాక్‌లో బక్రా నదిపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది. 182 మీటర్ల వంతెనను మూడు భాగాలుగా నిర్మించారు. ఇందులో రెండు భాగాలు నదిలో మునిగాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ నిర్మాణ్ యోజన కింద నిర్మించిన ఈ వంతెనకు రూ.7.79 కోట్లు ఖర్చు చేశారు. 182 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం 2021లో ప్రారంభమైంది. మొదట్లో రూ.7కోట్ల 80లక్షలు ఖర్చవుతుండగా.. తర్వాత నది గమనం, అప్రోచ్ రోడ్డు మారడంతో మొత్తం రూ.12కోట్లకు పెరిగింది.

Eha Tv

Eha Tv

Next Story