'లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి' అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శీ థరూర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలపై శశి థరూర్ మాట్లాడుతూ..

'లోక్‌సభ ఎన్నిక(Loksabha Elections)ల్లో బీజేపీ(BJP)కి అత్యధిక సీట్లు వస్తాయి' అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శీ థరూర్(Shashi Tharoor) అన్నారు. లోక్‌సభ ఎన్నికలపై శశి థరూర్ మాట్లాడుతూ.. బిజెపికి గరిష్ట సంఖ్యలో సీట్లు వస్తాయని.. అయితే మునుపటితో పోలిస్తే దాని సీట్లు తగ్గుతాయని అన్నారు. బిజెపికి దాని మిత్రపక్షాలు ఇకపై మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చని.. బదులుగా ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇవ్వవచ్చని ఆయన అన్నారు.

కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (Kerala Literature Festival)లో థరూర్ మాట్లాడుతూ.. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను.. అయితే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని నేను నమ్ముతున్నానని అన్నారు. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని.. తద్వారా ఓటమిని తప్పించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోందని థరూర్ చెప్పారు.

వివిధ రాష్ట్రాల్లో ఇండియీ(I-N-D-I-A) కూటమి సీట్ల పంపకం భిన్నంగా ఉంటుందని కాంగ్రెస్(Congress) నేత చెప్పారు. రెండు పొరుగు రాష్ట్రాలైన కేరళ(Kerala), తమిళనాడు(Tamilnadu)లను ఉదాహరణగా చెప్పారు. కేర‌ళ‌లో కూటమికి చెందిన రెండు ప్రధాన పార్టీలు సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు సీట్ల పంపకంపై ఎప్పటికైనా ఏకీభవిస్తాయనీ.. అయితే తమిళనాడులో మాత్రం సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు క‌లిసి ఉంటాయని ఊహించడం దాదాపు అసాధ్యమని థరూర్ అన్నారు.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ దేశంలోని ప్రజలు తమ త‌మ‌ నియోజకవర్గాలోని ఉత్తమ వ్యక్తుల‌కు ఓటు వేయాలని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎందుకంటే 'మోదీ, మోదీ' అని నినాదాలు చేసే వారు వారణాసి నుండి మాత్రమే ఓటు వేయగలరని తెలుసుకోవాలని థరూర్ అన్నారు. మన ప్రాంతంలో మంచి అభ్యర్థిని ఎంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Updated On 14 Jan 2024 11:23 PM GMT
Yagnik

Yagnik

Next Story