అసహజ శృంగారానికి బలవంతం చేశాడని ఓ యువకుడిని మరో యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన దిల్లీలో(Delhi) ఈ జనవరి 17న చోటుచేసుకుంది. తలపై బండ రాయితో బాదడంతో ఆ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. నిందితుడు బిహార్‌కు(Bihar) చెందిన రాజేశ్‌గా(Rajesh) పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న వెలుగులోకి వచ్చింది.

అసహజ శృంగారానికి(Romance) బలవంతం చేశాడని ఓ యువకుడిని మరో యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన దిల్లీలో(Delhi) ఈ జనవరి 17న చోటుచేసుకుంది. తలపై బండ రాయితో బాదడంతో ఆ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. నిందితుడు బిహార్‌కు(Bihar) చెందిన రాజేశ్‌గా(Rajesh) పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

జనవరి 19న దిల్లీలోని మోరీ గేట్‌కు డీడీఏ పార్క్‌(DDA Park) వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారమందించారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. మృతుడు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జలాన్‌ జిల్లాకు చెందిన ప్రమోద్‌ కుమార్‌ శుక్లాగా గుర్తించారు. శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. ఫుటేజ్‌లో శుక్లాతో పాటు రాజేశ్‌ అనే వ్యక్తి కనిపించాడు. దీంతో అతడిని పాట్నాలో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. తనను శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. ఎన్ని సార్లు అందుకు నిరాకరించినా శృంగారం పాల్గొనాలని బలవంత పెట్టేవాడని తెలిపాడు. ప్రమోద్‌కుమార్‌ శుక్లా వేధింపులను తట్టుకోలేకనే అతనిని హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో రాజేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.

Updated On 30 Jan 2024 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story