బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌కు(Nitish Kumar) పాపం ఎండదెబ్బ బాగా తగిలినట్టుగా ఉంది. అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నారు. నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో(ELection Campaing) మాట్లాడిన నితీశ్‌కుమార్‌ సోషల్‌ మీడియాకు(Social media) మంచి మేతను అందించారు.

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌కు(Nitish Kumar) పాపం ఎండదెబ్బ బాగా తగిలినట్టుగా ఉంది. అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నారు. నవాదాలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో(ELection Campaing) మాట్లాడిన నితీశ్‌కుమార్‌ సోషల్‌ మీడియాకు(Social media) మంచి మేతను అందించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఎన్‌డీయే(NDA) కూటమి నాలుగువేలకు పైగా సీట్లను గెల్చుకుంటుందట! ఈ మాట అన్న తర్వాత కూడా తన పొరపాటును సరిదిద్దుకోలేదు. ఆయన తన ప్రసంగంలో బాగా తడబడ్డారు. మొదట నాలుగు లక్షల సీట్లు అన్నారు. మళ్లీ సర్దుకుని నాలుగు వేల సీట్లు అన్నారు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నితీశ్‌కుమార్‌కు లోక్‌సభలో ఎంత మంది ఎంపీలు ఉంటారో కూడా తెలియదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

Updated On 8 April 2024 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story