పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజైన బుధవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం కొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ తొలి సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజైన బుధవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరగనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Arjun Ram Meghwal) మంగళవారం కొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ(Loksabha) తొలి సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ బిల్లు అని పేరు పెట్టారు. నారీ శక్తి వందన్ బిల్లు పూర్తిగా కొత్తది. ఇప్పటికే రాజ్యసభ(Rajyasabha)లో ఆమోదించిన చట్టానికి భిన్నంగా ఈ బిల్లు ఉంది. దీనిపై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది.

ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించబ‌డ‌టం తప్పనిసరి. ఆ తర్వాత దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది చట్టంగా మారి అమలులోకి వస్తుంది. అయితే జనాభా లెక్కలు, కొత్త డీలిమిటేషన్ తర్వాత మాత్రమే ఈ చట్టం అమలులోకి వస్తుంది. కొత్త డీలిమిటేషన్‌ను 2026లో ప్రతిపాదించారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ చట్టం ప్రభావం చూపదనే విషయం కూడా స్పష్టం అవుతోంది. నిజానికి జనాభా లెక్కల తర్వాతే మహిళల సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది. డీలిమిటేషన్ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు లభించే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొత్త మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన అనంత‌రం.. లోక్‌సభ సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. ఎగువ సభ బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి సమావేశం కానుంది. మంగళవారం పార్లమెంటు కొత్త భవనంలో రాజ్యసభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా, రాజ్యసభలో సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో ఇప్పటికే ఆమోదం పొందిందని.. అయితే అది నిలిచిపోయిందని అన్నారు. ఆయ‌న‌ మాకు క్రెడిట్ ఇవ్వరు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2010 లో ఆమోదించబడింది. కానీ అది నిలిచిపోయిందని నేను ఆయ‌న‌ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు 'బలహీనమైన మహిళలను' ఎన్నుకుంటాయి. పోరాడగలిగే విద్యావంతులైన మహిళలను కాదని అన్నారు.

ఖర్గే వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి సీతారామన్(Nirmala Sitaraman).. తమ పార్టీ మహిళలకు సాధికారత కల్పించిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మహిళ.. గిరిజన మహిళ అని కూడా ఆమె హైలైట్ చేశారు. మేము ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాము.. కానీ అన్ని పార్టీలు సమర్థత లేని మహిళలను ఎన్నుకుంటాయనే ప్రకటన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. మనందరికీ మా పార్టీ, ప్రధాని అధికారం ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బలమైన మహిళ అని స‌మాధాన‌మిచ్చారు.

కొత్త మహిళా రిజర్వేషన్‌ బిల్లులో అన్ని కులాలు, తరగతులు, మతాల మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఈ బిల్లులో అన్ని వర్గాల మహిళలకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించారు. ఇప్పటికే ఎస్సీ-ఎస్టీలకు రిజర్వ్ చేసిన 131 సీట్లకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. అంటే, రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు అదే వర్గానికి చెందిన మహిళలు బ‌రిలో ఉంటారు. కొత్త డీలిమిటేషన్‌లో సీట్ల సంఖ్య పెరిగితే.. రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. అన్ని సీట్లలో మహిళా రిజర్వేషన్ కాలపరిమితి 15 సంవత్సరాలు. ఆ తర్వాత సమీక్ష ఉంటుంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరితే మళ్లీ సభను ఆశ్రయించాల్సి ఉంటుంది.

Updated On 19 Sep 2023 9:07 PM GMT
Yagnik

Yagnik

Next Story