బెంగళూరులోని(Bangalore) బాగలూరు క్రాస్ వద్ద ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏపీకి చెందిన కృష్ణప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకొని విచారించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హతుడి కాల్‌ డేటా ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులోని(Bangalore) బాగలూరు క్రాస్ వద్ద ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏపీకి చెందిన కృష్ణప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకొని విచారించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హతుడి కాల్‌ డేటా ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఏపీకి చెందిన కృష్ణప్రసాద్‌ గత కొన్నేళ్లుగా బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌(Real estate) వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివసిస్తున్నాడు. అయితే కృష్ణప్రసాద్‌కు బట్టల వ్యాపరం చేసే సంతోష్‌కుమార్‌తో స్నేహం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్, బట్టల వ్యాపారి సంతోష్ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. అప్పడప్పుడూ సంతోష్‌కు డబ్బు సాయం కూడా చేసేవాడు కృష్ణ ప్రసాద్.
అయితే సోమవారం రాత్రి కృష్ణప్రసాద్‌, సంతోష్‌ కలిసి కారులో బాగలూరు క్రాస్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మరో స్నేహితుడు కూడా వీరిద్దరితో కలిశాడు. ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు సంతోష్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడని తెలిసింది. నీ బట్టల వ్యాపారానికి కావలసిన డబ్బులు సమకూరుస్తానని, కాకపోతే నీ భార్యను నాతో పడుకోవాలని అన్నాడని తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్‌ కారులో ఉన్న స్క్రూడ్రైవర్‌తో కృష్ణప్రసాద్‌ ఛాతిపై పొడిచి చంపాడు. శవాన్ని బాగలూరు క్రాస్‌ వద్దనే పడేసి పారిపోయారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. కృష్ణప్రసాద్‌ ఫోన్‌ను పరిశీలించగా విషయం బయటకు తెలిసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో కృష్ణప్రసాద్‌ను సంతోష్‌ హత్య చేశాడన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 20 March 2024 2:57 AM GMT
Ehatv

Ehatv

Next Story