మన దేశంలో కుల వివక్ష(cast difference) లేదననడం ఆత్మవంచనే అవుతుంది.

మన దేశంలో కుల వివక్ష(cast difference) లేదననడం ఆత్మవంచనే అవుతుంది. భారతీయులకు అంటిన కుల జాడ్యం ఇప్పట్లో అంతరించేలా లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా దళితుల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. బీజేపీ(BJP) పాలిత గుజరాత్‌లో(Gujarat) తాజాగా ఓ దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల యువకులు దారుణంగా కొట్టారు. ఇందుకు కారణమేమిటంటే పాపం ఆ యువకుడు సంప్రదాయ తలపాగా ధరించి కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడమే! సబర్‌కాంత జిల్లా సయేబాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో రిక్షా నడుపుకుని బతుకెళ్లదీస్తున్న అజయ్‌ పర్‌మార్‌ (24) అనే దళిత యువకుడు అగ్రవర్ణాల దాష్టికానికి గురయ్యాడు. దర్బార్‌ సామాజిక వర్గం వారే అలాంటి తలపాగా, కళ్లజోడు ధరించాలని చెబుతూ, వాటిని పెట్టుకోవడమే కాక ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయడానికి ఎంత ధైర్యం అంటూ తనను చితకబాదారని అజయ్‌ పర్‌మార్‌ వాపోయాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిపై కేసు నమోదు చేశామని, అయితే నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story