సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలులో విచారించి ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలులో విచారించి ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21, 2024న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయ‌న‌ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బుధవారం సంబంధిత ట్రయల్ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌ను హాజరుపరిచేందుకు దర్యాప్తు సంస్థకు మంగళవారం అనుమతి లభించింది. కేజ్రీవాల్‌ను ఈరోజు సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు విచార‌ణ అనంత‌రం ఆయనను ఈరోజు అధికారికంగా అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఆయన అరెస్టుపై ఆప్ రాజ్యసభ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయబోతోందని చెప్పారు. కేజ్రీవాల్‌పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్రకు పాల్పడుతోందని ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐతో బూటకపు కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సీబీఐ అధికారులతో కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ విచారణకు ముందే ఈ కుట్ర జరుగుతోంది. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించదని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story