ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సమన్లకు హాజరు కానందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై ఈడీ మళ్లీ ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సమన్లకు హాజరు కానందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై ఈడీ మళ్లీ ఫిర్యాదు చేసింది. సమన్లను పాటించనందుకు ఈడీ చేసిన రెండో ఫిర్యాదుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా సమన్లు ​​జారీ చేసింది. మార్చి 16న ప్ర‌త్య‌క్షంగా ఈడీ విచార‌ణ‌కు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. సీఎం కేజ్రీవాల్‌ సమన్లను పాటించకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో కూడా కోర్టును ఆశ్రయించింది. అప్పుడు ఫిర్యాదు కూడా నమోదైంది.

మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ జారీ చేసిన స‌మ‌న్ల‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే ధిక్క‌రించారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టులో తాజాగా ఫిర్యాదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ నాలుగు నుంచి ఎనిమిది సమన్లను పాటించలేదని ఈడీ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ACMM దివ్య మల్హోత్రా ED ఫిర్యాదును జాబితా చేసి మార్చి 7న విచారణకు తేదీని నిర్ణయించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌కు ED ఎనిమిది సార్లు సమన్లు ​​జారీ చేసింది. మొదటి మూడు సమన్లకు హాజరు కానందుకు ఈడీ స్థానిక కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి మార్చి 16న కోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ప్రశ్నించడానికి ED ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసింది. అంతకుముందు ఫిబ్రవరి 22న కూడా ఈడీ కేజ్రీవాల్‌కు విచారణ నిమిత్తం సమన్లు ​​పంపింది. అయితే ఏడవ సమన్లలో కూడా కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరుకాలేదు. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, 2 ఫిబ్రవరి, 14 ఫిబ్రవరి, 22 ఫిబ్రవరి, మార్చి 3 తేదీల్లో ED కేజ్రీవాల్‌కు విచారణ కోసం సమన్లు ​​జారీ చేసింది.

Updated On 7 March 2024 12:11 AM GMT
Yagnik

Yagnik

Next Story