తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించలేదని

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మధుమేహం కారణంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య పరీక్షల్లో కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ స్థిరంగా సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని వర్గాలు తెలిపాయి.

"ఏప్రిల్ 1న అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపినప్పుడు, వైద్య పరీక్షల సమయంలో ఆయన బరువు 65 కిలోలు.. ఏప్రిల్ 7న 66 కిలోలు. అంతేకాకుండా, షుగర్ స్థాయి కూడా మెయింటైన్ చేస్తున్నారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు" అని తీహార్ జైలు మూలాలు తెలిపాయి. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కు ప్రతి రోజు డయాబెటిక్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని చెప్పారు. కేజ్రీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

Updated On 10 April 2024 11:31 PM GMT
Yagnik

Yagnik

Next Story