దేశ ప్రజలంతా ఎదురు చూస్తు్న్న అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఈ మహా క్రతువుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ఈ నెల 16 నుంచే మొదలు కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జగరగనుంది

దేశ ప్రజలంతా ఎదురు చూస్తు్న్న అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఈ మహా క్రతువుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ఈ నెల 16 నుంచే మొదలు కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జగరగనుంది
ఈ నేపధ్యంలో జనవరి 14 నుండి 22 వరకు జగద్గురు రామానందాచార్యస్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ(BJP) ఎంపీ హేమమాలినితో(Hema Malini) సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తను ప్రత్యేక నృత్య ప్రదర్శను(Dance Performance) ఇవ్వనున్నట్లు నటి హేమమాలిని స్వయంగా చెప్పారు. రామాయణం ఆధారంగా ఉండే ఈ నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని హేమమాలిని ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఇక ఈ వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితోపాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు.

Updated On 14 Jan 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story