అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అంతకంటే గొప్పగా, నయనానందకరంగా జరిగింది. అనేక మంది ప్రముఖులు జగదానందకారకుడిని తిలకించడానికి అయోధ్యకు వెళ్లారు.
![Anasuya Bharadwaj Anasuya Bharadwaj](https://ehatvsite.hocalwire.in/wp-content/uploads/2024/01/anasuya-ayodhya-compressed.jpg)
Anasuya Bharadwaj
అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అంతకంటే గొప్పగా, నయనానందకరంగా జరిగింది. అనేక మంది ప్రముఖులు జగదానందకారకుడిని తిలకించడానికి అయోధ్యకు వెళ్లారు. రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు అయోధ్యలో సందడి చేస్తున్నారు. అయోధ్య వరకు వెళ్లలేని వారు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఆ అద్భుత ఘట్ట ఆవిష్కరణను తిలకించి మురిసిపోయారు. లేటెస్ట్గా యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya bharadwaj) కూడా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. 'ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు ఇది. నేను హనుమంతుడికి పరమ భక్తురాలుని. ఆంజనేయుడి పేరు వచ్చే విధంగా నా కొడుకు పేరు కూడా పెట్టాను. శ్రీరాముడే హనుమంతుడికి సర్వస్వం. నిజానికి ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. అయిదు శతాబ్దాల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడిని అయోధ్యలో దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. రానున్న రోజుల్లో అది నెరవేరుతుంది. జై శ్రీ రామ్’ అని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు అనసూయ. తన కొడుకు పేరును హనుమంతుని పేరు వచ్చేలా పెట్టినట్లు ఇన్నాళ్లకు తెలిపారు అనసూయ. అనసూయ కొడుకు పేరు తెలుసుకున్న నెటిజన్లు అనసూయలో ఇంతటి భక్తి ఉందా అని వ్యాఖ్యానిస్తున్నారు.
![Ehatv Ehatv](/images/authorplaceholder.jpg)