భార్యపై అనుమానం పెంచుకుని ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తను భార్యను చంపడాన్ని(Murder) పిల్లలు చూశారన్న కారణంతో వారిని కూడా చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లక్నో(Lucknow) జిల్లాలో బిజ్నోర్‌లో(Bijnor) ఈ దారుణం చోటు చేసుకుంది. శరవణ్‌ నగర్ ఏరియాలో రామ్‌లగన్‌ (32) అనే వ్యక్తి భార్య జ్యోతి (30), పిల్లలు పాయల్‌ (6), ఆనంద్‌ (3)తో కలిసి అద్దె ఇంట్లో నవాస ఉండేవాడు. భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు.

భార్యపై అనుమానం పెంచుకుని ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తను భార్యను చంపడాన్ని(Murder) పిల్లలు చూశారన్న కారణంతో వారిని కూడా చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లక్నో(Lucknow) జిల్లాలో బిజ్నోర్‌లో(Bijnor) ఈ దారుణం చోటు చేసుకుంది. శరవణ్‌ నగర్ ఏరియాలో రామ్‌లగన్‌ (32) అనే వ్యక్తి భార్య జ్యోతి (30), పిల్లలు పాయల్‌ (6), ఆనంద్‌ (3)తో కలిసి అద్దె ఇంట్లో నవాస ఉండేవాడు. భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరూ గొడవపడేవారు. మార్చి 28వ తేదీ రాత్రి కూడా ఇలాగే గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన రాంలగన్‌ పిల్లలు చూస్తుండగానే ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్‌తో ఉరి వేసి చంపాడు. వారి తల్లిని తానే చంపినట్టు పిల్లలు సాక్ష్యం చెబుతారేమోనన్న భయంతో ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడు. తర్వాత రాత్రంతా ఆ మృతదేహాల పక్కనే గడిపాడు. ఉదయం ఎప్పటిలాగే విధులకు వెళ్లి సాయంత్రం తిరిగివచ్చి పడుకున్నాడు. పిల్లలెక్కడ అని పక్కింటివాళ్లు అడిగితే హోలి పండుగకు తల్లిగారింటికి వెళ్లారంటూ అబద్ధం చెప్పాడు. మూడు రోజులు అలాగే పగలు బయటకు వెళ్లడం, రాత్రుళ్లు మృతదేహాల పక్కన పడుకోవడం చేశాడు. నాలుగో రోజు ఇంటి నుంచి దుర్వాసన వచ్చింది. తలుపులు తీసి ఉండటతో ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూశాడు. లోపల తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తలరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated On 2 April 2024 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story