గొంతులో చికెన్ ముక్క(Chicken Bone) ఇరుక్కొని వ్యక్తి మృతి(Death) చెందిన ఘటన ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట(Ellikata) గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్(Jharkhand) రాష్ట్రానికి చెందిన జితేంద్రకుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు.

గొంతులో చికెన్ ముక్క(Chicken Bone) ఇరుక్కొని వ్యక్తి మృతి(Death) చెందిన ఘటన ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట(Ellikata) గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్(Jharkhand) రాష్ట్రానికి చెందిన జితేంద్రకుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఇద్దరు చికెన్(Chicken) వండుకొని, పూరీలు చేసుకొని మద్యం తాగుతూ తింటుండగా జితేంద్రకుమార్(Jitendra Kumar) ఒక్కసారిగా కింద పడిపోయాడు. పక్కన వారు వచ్చి చూసే సరికి అతను చనిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్ మార్టం(Post mortem) నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని మృతి చెందినట్లు నిర్ధారించారు. ధర్మేందర్ తివారి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 10 Jan 2024 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story