తమిళనాడు కరూర్‌ గాంధీ (Tamil Nadu Karur Gandhi)గ్రామంలో చిత్రమైన సంఘటన జరిగింది.

తమిళనాడు కరూర్‌ గాంధీ (Tamil Nadu Karur Gandhi)గ్రామంలో చిత్రమైన సంఘటన జరిగింది. చనిపోయిన ఫ్రెండ్‌ ఓ వ్యక్తి కలలోకి వచ్చి పగ తీర్చుకోమని చెప్పాడట! వెంటనే ఆ వ్యక్తి ఓ యువకుడిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. వివరాల్లోకి వెళితే కరూర్‌ గాంధీ గ్రామానికి(Karur Gandhi Village) చెందిన సింథిల్‌ కుమార్‌(Sinthal Kumar)కు 19 ఏళ్ల జీవా(Jeeva)అనే కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని(Tirupur) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జీవా ఈ నెల 22వ తేదీన సెలవుపై కరూర్‌కు వచ్చాడు. సడన్‌గా అదృశ్యమయ్యాడు. సింథిల్‌కుమార్‌ ఇచ్చిన కంప్లయింట్‌తో తంథోనిమలై(Thanthonimalai) పోలీసులు కేసు నమోదు చేశారు, జీవా కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌(sheshiKumar)(27)తో పాటు పది మంది వ్యక్తులు జీవాను హత్య చేసి ఆ డెడ్‌ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలోపాతిపెట్టినట్టు తేలింది. శశికుమార్‌తో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చంద్రు(chandru) (21), కపిల్‌ కుమార్‌(kapil kumar) (20) పరారీలో ఉన్నారు. మోహన్‌(mohan),తాను క్లోజ్‌ ఫ్రెండ్స్‌మని శశికుమార్‌ చెబుతూ జరిగిందంతా వివరించాడు. 2021లో ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో తామిద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని, ఆ వైన్‌లో తమకు విషం కలిపి ఇచ్చారని, అది తెలియక ఇద్దరం తాగామని, విష ప్రభావంతో మోహన్‌ చనిపోయాడని శశికుమార్‌ చెప్పాడు. విషం కలపడం వెనుక జీవా పాత్ర కూడా ఉందని తెలిపాడు. మోహన్ కలలోకి వచ్చి తనను చంపిని వారిపై ప్రతీకారం తీర్చుకోమని చెప్పాడని, అందుకే తాను, స్నేహితులతో కలిసి జీవాను చంపేశామని శశికుమార్‌ పోలీసులకు వాంగూల్మం ఇచ్చాడు.

ehatv

ehatv

Next Story