ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Indhira Gandhi International airport) ఒక వ్యక్తి విస్తారా విమానంలో టెలిఫోనిక్ సంభాషణలో 'బాంబు'(Bomb) గురించి మాట్లాడుతున్నప్పుడు అతని సహ ప్రయాణికురాలు(Co-passenger) విన్నది. ఈ సంఘటన జూన్ 7 (బుధవారం) జరిగింది. ఆ వ్య‌క్తి ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన అజీమ్ ఖాన్ కాగా,

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Indira Gandhi International airport) ఒక వ్యక్తి విస్తారా విమానంలో టెలిఫోనిక్ సంభాషణలో 'బాంబు'(Bomb) గురించి మాట్లాడుతున్నప్పుడు అతని సహ ప్రయాణికురాలు(Co-passenger) విన్నది. ఈ సంఘటన జూన్ 7 (బుధవారం) జరిగింది. ఆ వ్య‌క్తి ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన అజీమ్ ఖాన్ కాగా, విస్తారా ఫ్లైట్ నంబర్ UK-941లో ఢిల్లీ నుండి ముంబైకి కనెక్టింగ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కి ప్రయాణిస్తున్నాడు. ఓ వ్య‌క్తి 'బాంబు' గురించి ఫోన్‌లో మాట్లాడడం విన్న మహిళ వెంటనే విమానంలోని విమాన సిబ్బందికి సమాచారం అందించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా.. సిబ్బంది నిందితుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్పగించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 9 Jun 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story