ప్రేమతో పిలిచారు కదా అని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిందో బాలిక. ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం(Rape) చేశారు దుర్మార్గులు. ఈ ఘటన చెన్నైలోని(chennai) పెరంబూర్‌(Perambur) ప్రాంతంలో జరిగింది. చేత్తుపట్టులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలక తన స్నేహితులతో కలిసి అన్నానగర్‌లో ఉన్న ఓ కాఫీ షాపుకు(Coffee) వెళ్లింది.

ప్రేమతో పిలిచారు కదా అని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిందో బాలిక. ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం(Rape) చేశారు దుర్మార్గులు. ఈ ఘటన చెన్నైలోని(chennai) పెరంబూర్‌(Perambur) ప్రాంతంలో జరిగింది. చేత్తుపట్టులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలక తన స్నేహితులతో కలిసి అన్నానగర్‌లో ఉన్న ఓ కాఫీ షాపుకు(Coffee) వెళ్లింది. అక్కడ పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయనటి ప్రతిషా అకీరాతో పరిచయం ఏర్పడింది. అది ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఈ కమంలో మే 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్‌లో జరిగిన తన బర్త్‌ డే వేడుకలకు రమ్మని విద్యార్థినిని ప్రతిషా అకీరా ఆహ్వానించింది. ఫ్రెండే కదా అని నమ్మి వెళ్లింది. అక్కడ ఆ విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడుతో పాటు ఇద్దరు యువకులు స్వీట్లు ఇచ్చారు.

స్వీట్లు తిననని ఆ బాలిక చెప్పుతున్నా ఆమెకు బలవంతంగా తినిపించారు. కొంచెం తినగానే ఆ బాలిక స్పృహ కోల్పోయింది. తర్వాత ఆ ఇద్దరు యువకులు ఆ బాలికను బెడ్‌ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. చాలా సేపయ్యాక ఆమెకు మెలకువవచ్చింది. తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి షాక్‌కు గురయ్యింది. అత్యాచారం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే నీతో పాటు నీ కుటుంబం పరువు కూడా పోతుందని ప్రితిషా అకీరా బెదిరించింది. భయాందోళలకు గురైన ఆ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బర్త్‌ డే పార్టీ అంటూ పిలిచి తన కూతురుకు మత్తు మందు కలిపిన స్వీట్లు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్‌ కోసం గాలిస్తున్నారు.

Updated On 9 Jun 2024 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story