గుజరాత్‌లోని(Gujarat) నవ్‌సారిలో విషాదం చోటుచేసుకుంది. మనవడు మృతి చెందాడన్న వార్త విని 90 ఏళ్ల లక్ష్మీబెన్‌ కసుంద్రా(Lakshmiben Kasundra) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. మృతురాలికి అశ్వినీకుమార్‌(Ashwini Kumar) అనే 42 ఏళ్ల మనవడు ఉన్నారు.

గుజరాత్‌లోని(Gujarat) నవ్‌సారిలో విషాదం చోటుచేసుకుంది. మనవడు మృతి చెందాడన్న వార్త విని 90 ఏళ్ల లక్ష్మీబెన్‌ కసుంద్రా(Lakshmiben Kasundra) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. మృతురాలికి అశ్వినీకుమార్‌(Ashwini Kumar) అనే 42 ఏళ్ల మనవడు ఉన్నారు. గత కొన్ని వారాలుగా అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం చనిపోయాడు. అతడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం నవ్‌సారికి తీసుకెళ్లారు. మనవడు చనిపోయాడన్న విషయం తెలుసుకుని లక్ష్మీబెన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే కన్నుమూసిందని వైద్యులు తెలిపారు. మనవడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే లక్ష్మీబెన్‌ అతడు చనిపోయిన రోజునే ఆమె కూడా మృతి చెందడంతో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.

Updated On 6 Feb 2024 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story