ఒడిశాలో(Odisa) ఓ మంత్రగాడు తన పైత్యమంతా ఓ యువతిపై చూపించాడు.

ఒడిశాలో(Odisa) ఓ మంత్రగాడు తన పైత్యమంతా ఓ యువతిపై చూపించాడు. అనారోగ్యంతో తన దగ్గరికి వచ్చిన యువతి పుర్రెలో(Head) ఏకంగా 77 సూదులు(Needles) గుచ్చి ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. సూదులు కుచ్చడంతో తీవ్ర తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన యువతి పుర్రెను చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె పుర్రెలోని సూదులను విజయవంతంగా తొలగించారు.

బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్(Veer surendhar sai Intitute of Medical sience and reasearch) లోని వైద్యులు ఈ ఆపరేషన్‌ చేసి ఆమె పుర్రె నుంచి మొత్తం 77 సూదులను తొలగించారు.

ఒడిషా రాష్ట్రం బాలింగర్ జిల్లాకు చెందిన రేష్మాబెహెరా అనే యువతికి అనారోగ్యం పాలైంది. దీంతో కుటుంబసభ్యులు మూఢనమ్మకంతో ఓ మంత్రగాని దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. తాంత్రిక పూజలు నిర్వహించే సంతోష్ తేజ్‌ రాజ్‌ రాణా అనే మంత్రగాడు యువతి తలలోకి 77 సూదులను కుచ్చాడు. మూఢ నమ్మాకాలతో రేష్మ కుటుంబం కూడా అతనిని ఏమీ అనలేదు. దీంతో యువతి మరింత అనారోగ్యం పాలైంది. ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో యువతిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తలనొప్పి తీవ్రంగా ఉందని చెప్పడంతో వెంటనే వైద్యులు ఆమెకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె పుర్రెలో సూదులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్‌ చేసి రెండు గంటలపాటు శ్రమించి విజయవంతంగా యువతి తలలో ఉన్న 77 సూదులను బయటకు తీశారు. తాంత్రికుడు కుచ్చిన సూదులు మెదడులోకి లోతుగా వెళ్లలేదని దీంతో యువతి మెదడుకు ఎలాంటి అపాయం కలగలేదని తెలిపారు. బాధితు కుటుంబసభ్యులు తాంత్రికుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంత్రగాడిని అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణ చేయగా యువతి తలలో సూదులు గుచ్చింది నిజేమనని ఒప్పుకున్నాడు.

Eha Tv

Eha Tv

Next Story