ఏడో తరగతి విద్యార్థినిని 'ప్రెగ్నెంట్‌' చేసిన పదో తరగతి విద్యార్థి

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) సహరాన్‌పూర్‌లో(saharanpura) ఓ దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదివే కుర్రాడు ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం(Rape) చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో గమ్మున్న ఉన్న బాలిక. రానురాను యువతి శరీరంలో మార్పులు, అనారోగ్యం వచ్చింది. దీంతో డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లిన తల్లికి షాక్‌ కొట్టినంత పనైంది డాక్టర్‌ చెప్పింది విని. బాలిక ఇప్పుడు గర్భవతి(Pregnant) అని, తనకు ఇప్పుడు ఆరో నెల అని డాక్టర్‌ చెప్పడంతో విస్తుపోయింది. విషయం మొత్తం తెలుసుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ జిల్లా చిల్కానా పీఎస్‌ పరిధిలో జరిగింది. ఓ మహిళ తన కూతరుతో జీవిస్తోంది. ఆమె భర్త ఆరు నెలల క్రితమే చనిపోయాడు. తండ్రి మరణించిన తర్వాత రెండు, మూడు రోజులకు బాలిక స్నేహితుల దగ్గరకు వెళ్తోంది. ఈ క్రమంలో బాలికను అడ్డగించిన పదో తరగతి విద్యార్థి ఆమెను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం తర్వాత బాలికను బెదిరించాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మిన్నకుండిపోయింది. ఆరు నెలల తర్వాత విద్యార్థిని ఆరోగ్యం విషమించింది. కడుపునొప్పి, వాంతులు, జ్వరం చుట్టుముట్టింది. కూతురిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన అనంతరం బాలిక గర్భవతని తేలింది. కుటుంబసభ్యులు విద్యార్థినిని విచారిస్తే ఆ బాలిక జరిగిందంతా వివరించింది. దీంతో తన కూతురుపై అత్యాచారం చేసిన బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుసుకున్న నిందితుడు గ్రామం నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story