గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు (Covid-19) నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరింది. ఇందులో కేరళ (Kerala)లోనే అత్యధికంగా 3,128 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో యాక్టివ్ కేసుల 344కు చేరింది

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు (Covid-19) నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరింది. ఇందులో కొత్తగా 63 జె.ఎన్‌.1 (JN.1) కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ (Kerala)లోనే అత్యధికంగా 3,128 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో యాక్టివ్ కేసుల 344కు చేరింది. ఇందులో 34 మందికి కొత్త జేఎన్.1 వేరియెంట్ సోకింది. బెంగళూరు (Bengalore)లోనే 20 మందికి జె.ఎన్.1 వేరియెంట్ సోకింది. మహారాష్ట్రలో (Maharastra) 28 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కొత్త వేరియెంట్‌ కేసులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారు.

Updated On 26 Dec 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story