బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళకు బైక్‌పపై ఇద్దరు లిఫ్ట్‌ ఇచ్చారు.

బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళకు బైక్‌పపై ఇద్దరు లిఫ్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడు (Tamil Nadu)రాష్ట్రం తంజావూర్‌(Thanjavur) జిల్లా పూతలూరు(Puthaluru)లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తంజావూర్‌ జిల్లా పూతలూర్‌లో బస్సు కోసం మహిళ ఎదురుచూసింది. 42 ఏళ్ల అవివాహిత పనికెళ్లి రాత్రి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి చూస్తుంది. ఆ సమయంలోనే అటుగా ద్విచక్రవాహనాలపై వచ్చిన రాయందూర్‌(Rayamdur)కు చెందిన ప్రవీణ్‌(Praveen) (32), రాజ్‌కపూర్‌(Rajkapur)(26) అనే యువకులు బస్టాండ్‌లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. ఒంటరిగా ఉన్నావని, లిఫ్ట్‌ ఇస్తామని నమ్మబలికారు. ప్రవీణ్‌ తన బైక్‌పై మహిళను ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ప్రవీణ్‌ వెనుకే మరో బైక్‌పై రాజ్‌కపూర్‌ వారిని వెంబడిస్తూ వెళ్లాడు. పూతలూర్‌ దాటగానే నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఇద్దరు యువకులు ఆమెను రేప్‌ చేశారు. ఆ తర్వాత బాధితురాలని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్‌ చేశారు.

ehatv

ehatv

Next Story