దేశ వ్యాప్తంగా పేలుళ్లకు(Blast) కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు జైలు శిక్ష ప‌డింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ(Delhi NIA) ప్రత్యేక కోర్టు తీర్పు వెలువ‌రించింది. నిందితులు హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ చేసిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది.

దేశ వ్యాప్తంగా పేలుళ్లకు(Blast) కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు జైలు శిక్ష ప‌డింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ(Delhi NIA) ప్రత్యేక కోర్టు తీర్పు వెలువ‌రించింది. నిందితులు హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ చేసిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది.

నిందితులు పేలుళ్ల కోసం ఆయుధాలు సైతం సమకూర్చుకున్న‌ట్లు ఎన్ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్.. బీహార్ కు చెందిన ధనీష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను ఎన్ఐఏ 2013లో అరెస్ట్ చేసింది. నిందితులు ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలుప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన‌ట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2007లో గోకుల్ చాట్(Gokul Chat), లుంబినీ పార్కు(Lumbini Park) జంట పేలుళ్లు(Joint Blasts), 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉన్న‌ట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది

గతంలో వారణాసి, ముంబ‌యి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల ప్ర‌మేయం గుర్తించిన‌ట్లు ఎన్ఐఏ వెల్ల‌డించింది. ఈ కేసులలో ఎన్ఐఏ మొత్తం 11మందిని నిందితులుగా చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్ తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది.

నలుగురు దోషులపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలు పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన కీలక నిందితులు రియాజ్ భత్కల్, భారత్‌కు చెందిన యాసిన్ భత్కల్‌లతో సహా ఇండియన్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులతో ఈ నలుగురు చాలా సన్నిహతంగా ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. దేశంలోని మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టులో వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Updated On 13 July 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story