భద్రాద్రి(Badradri)-కొత్తగూడెం(Kothagudem) జిల్లా మణుగూరులో సాయిబాబాగూడెంలో విషాదం అలుముకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న చిన్నారి జీవితం మూడేళ్లకే ముగిసిపోయింది. ఆడుతూ కారులోకి ఎక్కిన చిన్నారి డోర్‌ లాక్‌ పడడంతో ఊపిరాడక దాంట్లోనే చణిపోయింది.

భద్రాద్రి(Badradri)-కొత్తగూడెం(Kothagudem) జిల్లా మణుగూరులో సాయిబాబాగూడెంలో విషాదం అలుముకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న చిన్నారి జీవితం మూడేళ్లకే ముగిసిపోయింది. ఆడుతూ కారులోకి ఎక్కిన చిన్నారి డోర్‌ లాక్‌ పడడంతో ఊపిరాడక దాంట్లోనే చణిపోయింది. సాయి లిఖిత అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న కారు(Car) ఎక్కింది. డోర్లు లాకవడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చిన్నారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరకు కారులో స్పృహ పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదు. అప్పటికే ఊపిరాడక చిన్నారి సాయి లిఖిత(Sai likhitha) కన్నుమూసిందని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. మూడేళ్లకే కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On 22 May 2024 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story