తమిళనాడు(Tamilnadu) మహాబలిపురం(Mahabalipuram) బీచ్‌లో ముగ్గురు తెలుగు విద్యార్థులు(Telugu students) సముద్రంలో గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు కాలేజీ తరఫున తమిళనాడు పర్యటనకు వెళ్లారు.

తమిళనాడు(Tamilnadu) మహాబలిపురం(Mahabalipuram) బీచ్‌లో ముగ్గురు తెలుగు విద్యార్థులు(Telugu students) సముద్రంలో గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు కాలేజీ తరఫున తమిళనాడు పర్యటనకు వెళ్లారు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఈత కోసం విద్యార్థులు సముద్రంలో దిగారు. ఇందులో మౌనిష్‌, విజయ్‌, ప్రభు అనే ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. వారి జాడ కోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. మౌనిష్‌ది బంగారుపాలెం మండలం కాగా విజయ్‌ది సదుం మండలం. పులిచెర్ల గ్రామంలో ప్రభు ఉంటాడు. విద్యార్థుల గల్లంతయ్యారన్న వార్త తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Updated On 2 March 2024 8:13 AM GMT
Ehatv

Ehatv

Next Story