ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం నుండి

ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం నుండి యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడి అనంతరం బస్సు లోయలో పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూలాల ప్రకారం, రాజౌరి, పూంచ్ మరియు రియాసి ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదుల సమూహం ఈ పని చేసిందని అనుమానిస్తున్నారు.

దాడికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాడికి సంబంధించిన, గాయపడిన వారికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 9 Jun 2024 9:32 AM GMT
Yagnik

Yagnik

Next Story