బీహార్‌లోని(Bihar) గోపాల్‌గంజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది.

బీహార్‌లోని(Bihar) గోపాల్‌గంజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. ఓ అత్త(aunt) తన మేనకోడలిపై(Niece) మనసు పారేసుకుంది. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఆ ప్రేమలో పడి భర్తను కూడా వదిలేసింది. ఇంటి నుంచి వెళ్లిపోయి మేనకోడలిని పెళ్లి చేసుకుంది. తాము పెళ్లి చేసుకున్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా కుటుంబసభ్యులకు తెలియచేశారు కూడా! ఈ వింత ఘటన కుచాయిట్‌కోట్ పోలీసుస్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామంలో జరిగింది. అత్తా కోడళ్లు ససముసాలోని దుర్గాభవాని ఆలయంలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. పరస్పరం పూలదండలు వేసుకున్నారు. గమ్మత్తేమిటంటే అత్త మెడలో మేనకోడలు తాళి కట్టడం. ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడుఅడుగులు నడిచారు. ఏడేడు జన్మలు కలిసే ఉంటామని ప్రమాణం చేశారు.

Eha Tv

Eha Tv

Next Story