ముంబైలో షవర్మా(shawarma) తిన్న 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. త్రోంబే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫుడ్ సెంటర్‌లో(Food Center) ఈనెల 3న షవర్మా తీసుకెళ్లిన ప్రత్మేష్ భోక్సేకు కడుపు నొప్పి, వాంతులు వచ్చాయి

ముంబైలో షవర్మా(shawarma) తిన్న 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. త్రోంబే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫుడ్ సెంటర్‌లో(Food Center) ఈనెల 3న షవర్మా తీసుకెళ్లిన ప్రత్మేష్ భోక్సేకు కడుపు నొప్పి, వాంతులు వచ్చాయి. తర్వాత వైద్యుడిని సంప్రదించగా చికిత్స అందించి పంపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మరుసటి రోజు కడుపు నొప్పి తగ్గలేదు.దీంతో అతని కుటుంబ సభ్యులు మే 5 న సివిక్-రన్ KEM ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించినా ఫలితం లేదు. దీంతో సోమవారంనాడు ప్రత్మేష్ మృతి చెందాడు. కల్తీ ఆహారం తినడంతోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని పోలీసులకు వైద్యులు నివేదించారు. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు వ్యాపారులు ఆనంద్ కాంబ్లే, అహ్మద్ షేక్‌లను అరెస్టు చేశారు మరియు వారిపై 304 సహా వివిధ IPC సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

Updated On 9 May 2024 4:11 AM GMT
Ehatv

Ehatv

Next Story